PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ చేనేత ఆడబిడ్డని ఆదరించండి అభివృద్ధిని చేసి చూపిస్తా 

1 min read

నియోజకవర్గ అభ్యర్థి బుట్టా రేణుక వెల్లడి

బిసి మహిళ అయిన నాకు అవకాశం వచ్చింది. ఎస్సీలు, ఎస్టీలు ,బీసీలు, మైనార్టీలు, మీరందరూ ఒకే తాటిపై నిలబడి నన్ను ఎమ్మెల్యే గెలిపించాలని అభ్యర్థిస్తున్న.

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్ఎంటి కాలనీ నాగప్పలకట్ట దగ్గర,22,23,24,24 వార్డ్ లు, మిలిటరీ కాలనీ తారు రోడ్డు పక్కన 26,27,29 వార్డుల లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభలలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక . శ్రీమతి బుట్టా రేణుక  మాట్లాడుతూ మన జగనన్న పేదల గురించే ఆలోచించే మనసున్న మహారాజు అని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి కావాలని, మే 13 జరగబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్యకు రెండు ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్, మున్సిపల్ చైర్మన్ , రఘు కౌన్సిలర్లు, వార్డ్ ఇన్చార్జిలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author