PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తిశ్రద్ధలతో ముర్షద్ పీర్ ఖాద్రీ ఉరుసు మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మండల పరిధిలోని వగరూరు గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్ షా ముర్షద్ పీర్ ఖాద్రీ ఉరుసు మహోత్సవం దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ లతీఫ్ ఖాద్రీ ఆధ్వర్యంలో సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ను పట్టువస్త్రాలతో వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. గ్రామ దర్గా ను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవానికి చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. వచ్చిన వారికి ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.మదర్సా విద్యార్థులచే ప్రవక్త ప్రవచనాలు : – ఉరుసు మహోత్సవం సందర్భంగా స్థానిక మదర్సా గురువు జావేద్ షర్ఫి విద్యార్థులచే మహ్మద్ ప్రవక్త జీవితం గురించి, ఖురాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author