PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింల అభ్యన్నతే లక్ష్యం

1 min read

పేద ముస్లింల కోసం..‘షాదిఖానా’ పూర్తి చేయండి

–ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్​ఎండి ఫరూక్​ను కోరిన ఎమ్మెల్యే డా. పార్థసారధి

 ఆదోని, పల్లెవెలుగు:కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పేద ముస్లింలకు ఉపయోగపడే షాదిఖానా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని శనివారం మైనార్టీ శాఖ మంత్రి ఎన్​ ఎండి ఫరూక్​ను ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి కోరారు.  పేద ముస్లిం యువతీ యువకుల పెళ్లిలకు ఉపయోగపడే షాదిఖానా భవన నిర్మాణం నిధులు లేకపోవడంతో సగం నిర్మాణమే పూర్తి అయిందని, వెంటనే నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు.  అదేవిధంగా ఈద్గా నిర్మాణానికి నిధులు కేటాయించాలని విన్నవించారు. అంతేకాక మైనార్టీల స్కూల్​ పిల్లల కోసం ఉన్న భవనాలు  ఇరుకుగా ఉన్నాయని, హాస్టల్​ లో కూడా మరిన్ని వసతులు సమకూర్చేలా చూడాలని, వీటన్నింటినీ ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఎన్​.ఎండి ఫరూ క్​ ను కోరినట్లు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డా. పార్థసారధి శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

About Author