PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాయి ప్రసాద్​ రెడ్డికి… ముస్లింలు ఓటు వేయొద్దు…

1 min read

మూడు సార్లు ఎమ్మెల్యే… మీకు ఏం చేశాడో చెప్పండి…

  • పూరి గుడిసెలోనే జీవిస్తున్నారు…తాగునీటికి అవస్థలు పడుతున్నారు..
  • రోడ్లు లేవు… మురుగు కాల్వలు అస్తవ్యస్థంగా ఉన్నాయి..
  • ఒక్కసారి అవకాశం ఇవ్వండి… ముస్లింల కాలనీలన్నీ అభివృద్ధి చేస్తా..
  •  ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:‘ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు… కోట్లకు పడగలెత్తాడు…. మీరు మాత్రం పేదరికంతోనే మగ్గిపోతున్నారు.. ఈ సారి ఎన్నికల్లో సాయి ప్రసాద్​ రెడ్డికి ఓటు వేయొద్దు….’ అని ముస్లింలకు పిలుపునిచ్చారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి.  ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని దుష్ప్రచారం చేస్తున్నారు.  అభివృద్ధి చేసే వారు కావాలో…. మోసం చేసే వారు కావాలో మీరే నిర్ణయించుకోండి అని ముస్లిం సోదరులకు సలహా ఇచ్చారు. శనివారం పట్టణంలోని మరాఠిగేరి, పరిషాముల్లా, సాయంత్రం పెద్దతుంబళం గ్రామంలో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ భూ కబ్జాలు..దందాలు, మద్యం, ఇసుక, రేషన్​ మాఫియాను పెంచి పోషిస్తున్న సాయి ప్రసాద్​ రెడ్డి కి మరోసారి ఓటు వేస్తే…. మీరు మరింత పేదరికంలోకి వెళ్లడంతోపాటు.. ఆదోని మరో 30 ఏళ్లు వెనుకబడి పోయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వారానికోసారి తాగునీరు… డ్రైనేజీ అస్తవ్యస్తం… సొంత ఇల్లు లేవు… వీధిలైట్లు వెలగవు…. ఇలా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా…. ఎప్పుడైనా ఎమ్మెల్యే మీ సమస్యను పరిష్కరించాడా… అని ప్రశ్నించారు.  ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తే…. ముస్లింల కాలనీలను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తానని  డా. పార్థసారధి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author