PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాయీ బ్రాహ్మణుల అభ్యన్నతి..ఎన్డీయేతోనే సాధ్యం

1 min read

కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యమన్నారు కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. పట్టణంలోని శ్రీ మంగళ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం నాయీ బ్రాహ్మణులతో కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమని, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్నారు. అనంతరం నాయీ బ్రాహ్మణులు మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వంలో విసిగిపోయామని ఎన్డిఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో తమకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన నాయకుడు మల్లప్ప మాట్లాడుతూ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి … కూటమి అభ్యర్థి డా. పార్థసారధిని గెలిపించాలని నాయీ బ్రాహ్మణులను కోరారు.

About Author