PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్​  సప్లిమెంటరీ ఫలితాలలో నారాయణ విద్యార్థుల అత్యున్నత ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖమంత్రి విడుదల చేసిన ఇంటర్ ఫస్టియర్ అడ్యాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలలో కర్నూలు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు MPC మరియు BiPC నందు అత్యున్నత ప్రతిభ కనబరిచి, మంచి ఫలితాలను కైవసం చేసుకున్నారని కర్నూలు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది.Jr. Bi.P.C నందు మహమ్మద్. హసీన 437 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా అబ్దుల్ ఉమర్ షేక్ 436 మార్కులు, మహమ్మద్ సైఫ్ 435 మార్కులు, మహమ్మద్ నజీర్ 435 మార్కులు, దీపిక 435 మార్కులు, అఖిల 435 మార్కులు లాంటి అత్యున్నత మార్కులు సాధించారు.అలాగే 437 మార్కుల పైన ఒక్కరు, 436 మార్కుల పైన ఇద్దరు, 435 మార్కుల పైన 6 గురు, 430 మార్కుల పైన 51 మంది, 420 మార్కుల పైన 138 మంది, 400 మార్కుల పైన 269 మంది విద్యార్థులు సాధించారు. Jr. Bi.P.C నందు 98% పాస్ అయ్యారు.Jr. M.P.C నందు సి. మధుర వాణి 467 మార్కులు, షెక్. జోహ 466 మార్కులు, పి. హరిణి 466 మార్కులు, కె. అక్షయ 466 మార్కులు, పి. జస్వంత్ నాయక్ 466 మార్కులు, ఎమ్.వర్షిత రెడ్డి 466 మార్కులు, ఐ. ఎంజెల్ వాణి ఈడెన్ 466 మార్కులు, బి. స్పందన 466 మార్కులు, ఎమ్. శ్రావణి 466 మార్కులు, ఇ. ప్రహస 466 మార్కులు సాధించారు.అలాగే 467 మార్కుల పైన ఒక్కరు, 466 మార్కుల పైన 10 మంది విద్యార్థులు, 465 మార్కుల పైన 37 మంది విద్యార్థులు, 464 మార్కుల పైన 78 మంది విద్యార్థులు, 460 మార్కుల పైన 208 మంది విద్యార్థులు, 450 మార్కుల పైన 551 మంది విద్యార్థులు, 440 మార్కుల పైన 854 మంది విద్యార్థులు, 400 మార్కుల పైన 1644 మంది విద్యార్థులు సాధించారు. Jr. M.P.C నందు 98% పాస్ అయ్యారు.ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి.గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్ కె. హవీల సామ్రాట్, వేణు గోపాల్ రెడ్డి, జయరామి రెడ్డి, సుధాకర్ రెడ్డి, విజయ మోహన్, పి.సుజాత, సాంబశివా రెడ్డి, సూర్యకుమారి, కైరునీసాబీ అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author