PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రకృతి వ్యవసాయం ఆదర్శం కావాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  ప్రకృతి వ్యవసాయం భావితరాలకు ఆదర్శం కావాలని బీజేపీ మండల అధ్యక్షులు కె. బి. దామోదర్ నాయుడు అన్నారు. సోమవారం ప్యాపిలీ స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో పొలంలో పండించిన కూరగాయలను,ఆకూరలను, పరిశీలించారు. ప్రస్తుత కరీఫ్‌ సీజన్‌లో రైతులకు అందుబాటులో ఉండి సూచనలు, సలహాలను ఇవ్వాలన్నారు. ఖరీఫ్‌లో సాగు చేసే పంటలపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌.బి.కె కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలన్నారు. విత్తనాలతో సాగు చేసిన ప్రsకృతి వ్యవసాయ పంటలను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కే. బి. దామోదర్ నాయుడు, నియోజకవర్గ ఇంచార్జి వడ్డే మహారాజ్, ఓబిసి మోర్చా కే. సి. మద్దిలేటి, ఆర్మీ రామయ్య, తిమ్మారెడ్డి, ఓబయ్య,మల్లికార్జున మరియు ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ నరేంద్ర, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శివరామయ్య, చెన్నప్ప, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author