PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబుతోనే నవ్యాంద్ర ప్రదేశ్ అభివృద్ధి

1 min read

టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : నవ్యంద్ర ప్రదేశ్ చంద్రబాబునాయుడు తోనే అభివృద్ధి చెందుతుందని టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి అన్నారు.  బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4 వ సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా స్థానిక రాఘవేంద్ర సర్కిల్ లో బాణా సంచా పేల్చి సంబరాలతో స్వీట్స్ పంచి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ఆరాచక పాలనకు ప్రజలు స్వస్తి చెప్పి చంద్రబాబుకు పట్టం కట్టారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని భావించి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. ఎన్నికల రోజే చిరు జల్లులు కురిసి చంద్రబాబు కు ఆశిస్సులు అందించడం శుభ సూచకమని భావించామని తెలిపారు. ఎన్డీఏ కూటమి లో చంద్రబాబు ప్రముఖ పాత్ర వహించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణ సహకారం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు జిందాబాద్, తెలుగుదేశం వర్ధిల్లాలి తిక్కారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, తిక్కారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు నక్కి వెంకటేష్, నాయకులు చిన్న సుంకప్ప, హండే అనుమంతు, వనికె నాగరాజు, గనేకంటి రఘు మేకల నర్సింహ, వరదరాజు, ఏబు, పౌలు, పేతూరు నతానియేలు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author