PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏబీవీపీ ఎమ్మిగనూరు నూతన నగర కమిటీ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :   ఎమ్మిగనూరు పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏబీవీపీ. ఎమ్మిగనూరు శాఖ ఆధ్వర్యంలోనూతన నగర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నగర కార్యదర్శిగా వంశీ సహాయ కార్యదర్శులుగా పవన్,మల్లికార్జున, ఉమేష్,లను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గేటు ఎర్రిస్వామి పాల్గొని దేశహితం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం జరుగుతుందని గాడంగా నమ్మినటువంటి విద్యార్థి సంస్థ, విద్యా వ్యవస్థలు జరుగుతున్నటువంటి అనేక సమస్యలపై విద్యార్థి పరిషత్ ఎప్పటికి ఎప్పుడు విద్యార్థులను సంఘటితం చేస్తూ సమస్యను పరిష్కరించే దిశగా విద్యార్థి పరిషత్ పోరాటాలు చేస్తుందన్నారు. విద్యార్థి పరిషత్ లో ఈరోజు నూతన కార్యదర్శులుగా సహాయ కార్యదర్శిగా మీరు ఎన్నుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని రానున్న రోజుల్లో ఎమ్మిగనూరులో విద్యార్థి పరిషత్  ద్వారా మరింత నాణ్యమైన విద్యను అధికారుల ద్వారా అందించే ప్రయత్నం చేస్తుంది అన్నారు,  నగర కార్యదర్శి మాట్లాడుతూ నాపై బాధ్యత ఉంచినటువంటి విద్యార్థి పరిషత్ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు .అలాగే ఎమ్మిగనూరు పట్టణంలో విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలిపారు. అనంతరం 22 మందితో కూడిన కమిటీ సభ్యుల ద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా పోరాటం చేస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో కర్నూల్ విభాగ్. ఎస్ ఎఫ్ డి. కన్వీనర్ మారుతి , కిరణ్, గోపాల్,గోవర్ధన్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

About Author