PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిసిసి నూతన అధ్యక్షులుగా శ్రీ పరిగెల మురళీకృష్ణ

1 min read

పదవీ బాధ్యతల స్వీకారం

 పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం కళా వెంకట్రావు భవనం కర్నూలు నందు రేపు 10:09:2024వ తేదీ మంగళవారం ఉదయం 10:30 ని”లకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటి నూతన అధ్యక్షులుగా మాజి ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు శ్రీ పరిగెల మురళీకృష్ణ  పదవీ బాధ్యతలు స్వీకరించ నున్నారు. ముందుగా సి క్యాంప్ సెంటర్ నందలి శ్రీ రాజీవ్ గాంధీ  విగ్రహమునకు, కిసాన్ ఘాట్ నందలి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి  సమాధికి, రాజవిహార్ సెంటర్ నందలి శ్రీమతి ఇందిరా గాంధీ  విగ్రహమునకు, ఐదు రోడ్ల సర్కిల్ నందలి శ్రీ బాబు జగ్జీవన్ రామ్  విగ్రహమునకు, కోట్ల సర్కిల్ నందలి కోట్ల విజయభాస్కర రెడ్డి  విగ్రహమునకు, పాత బస్టాండ్ నందలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహమునకు, పార్టీ కార్యాలయం ముందు గల శ్రీ దామోదరం సంజీవయ్య  విగ్రహమునకు పూలమాలలు వేసిన అనంతరం పార్టీ కార్యాలయమునకు విచ్చేసి పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించెదరు.అనంతరం కర్నూలు సిటీ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా షేక్ జిలాని భాష  పదవి బాధ్యతలు చేపట్టుదురు.కనుక ఈ కార్యక్రమమునకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నూలు జిల్లా పరిధి నందలి నూతన పిసిసి కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలకు పోటీ చేసిన అభ్యర్థులు మాజీ డిసిసి కార్యవర్గ సభ్యులు, కర్నూలు నగర కాంగ్రెస్, పార్టీ అనుబంధ సంస్థలైన జిల్లా మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఐ ఎన్ టి యు సి, ఎన్ ఎస్ యు ఐ, సేవాదళ్, కిసాన్ సెల్, లీగల్ సేల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ సెల్, డాక్టర్ సెల్, కల్చరల్ సెల్, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ మొదలగు నాయకులు ఈ కార్యక్రమమునకు హాజరు కావలసిందిగా కోరుచున్నాము.పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీ పరిగెల మురళీకృష్ణ కి జిల్లా కాంగ్రెస్ నాయకులు సన్మానం చేసెదరు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *