PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బివి జయనాగేశ్వర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో ఇంద్ర నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుండి టిడిపి బిజెపి జనసేన పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి సోమప్ప కుండాలి మీదుగా తాసిల్దార్ కార్యాలయం చేరుకున్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ మాచన్ సోమనాథ్ బిజెపి నాయకుడు నరసింహులు వీరి ఆధ్వర్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి  నామినేషన్ పత్రాలను సమర్పించారు అనంతరం నియోజకవర్గ అభ్యర్థి బివి జయనేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఆకర్షితులై గెలుపు ఖాయమని అన్నారు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

About Author