PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముక్కోటి దేవతల ఆశీసులతో… నిరాడంబరంగా నామినేషన్ దాఖలు

1 min read

మాండ్ర శివానంద రెడ్డి, గౌరు వెంకట రెడ్డి ఆశీర్వాదంతో..

నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే  అభ్యర్థిగా గిత్త జయసూర్య  నిరాడంబరంగా సోమవారం  నామినేషన్ దాఖలు చేశారు. నందికొట్కూరు తహశీల్దార్ కార్యాలయంలో   ఉదయం 11.45  గంటలకు  రిటర్నింగ్ అధికారి ఎం. దాసు కు గిత్త జయసూర్య  నామినేషన్ పత్రాలను అందచేశారు. సోమవారం ఉదయం 11.15గంటలకు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో శివాలయం, ఆంజనేయ స్వామి దేవస్థానంలో గిత్త జయసూర్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి మాండ్ర శివానంద రెడ్డి స్వగృహంలో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆశీసులు తీసుకొని నందికొట్కూరు కు ర్యాలీగా తరలివచ్చారు. టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి ,మాండ్ర లింగారెడ్డి, మైనార్టీ నాయకులు మునాఫ్, కొత్తపల్లి రామయ్య  లు వెంట రాగా, నిరాడంబరంగా, నిబద్ధతతో బయలు దేరి ఆర్ డి ఓ కార్యాలయానికి చేరుకున్నారు.నామినేషన్ కార్యక్రమానికి బయలు దేరిన జయసూర్య కు నియోజకవర్గ మండలాల పరిధిలోని టీడీపీ  పార్టీ నాయకులు, పెద్దలు ,కార్యకర్తలు, అభిమానులు దీవెనలు, శుభాకాంక్షలు  అందచేశారు.అనంతరం జయసూర్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ నందికొట్కూరు లో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

About Author