PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా విజయం కాదు..టిడిపి కార్యకర్తల విజయం

1 min read

-విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జయసూర్య

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి ప్రభుత్వమని ప్రతి రైతును ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాని దేనని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లాజూపాడుబంగ్లా మండల కేంద్రంలో సోమవారం ఉదయం మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఖరీఫ్ కు రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే నేటికీ కనబడుతున్నాయని రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని గతంలో చంద్రబాబు హయాంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు కూడా నందికొట్కూరును  అభివృద్ధి పథంలో నడిపిస్తామ ని అన్నారు.నా గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మన రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వస్తుంది కానీ ఇక్కడ నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడని అనుకున్న వాళ్లకు అంతా కూడా నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని ఇది నా విజయం కాదని టిడీపీ గెలుపునకు కృషిచేసిన ప్రతి కార్యకర్త విజయమని అన్నారు. మండలంలో రైతులు కూలీలు సాగు తాగునీటి సమస్యలు పరిష్కరించి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. తర్వాత కంది విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్,నంద్యాల జిల్లా టిడిపి అధికార ప్రతినిధి గిరీశ్వరరెడ్డి, ఎంపీటీసీ వెంకటమ్మ,సర్పంచ్ రవి,ఏడిఏ విజయ శేఖర్, బాబు,పెద్దన్న,కృష్ణయ్య, శ్రీను,నారాయణరెడ్డి, రమణారెడ్డి,బాలమద్దిలేటి, హనుమంత్ రెడ్డి,శివరామిరెడ్డి, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

About Author