PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం

1 min read

ఆనందంతో తబ్బిబౌతున్న అవ్వ,తాతలు పెన్షన్ లబ్ధిదారులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అవలంబిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం జానంపేట శివారు ప్రకాష్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా గత నెలలో ఇవ్వాల్సిన 3000 వేల రూపాయలు మరియు చంద్రబాబు అందిస్తున్న 4000 వేల రూపాయలు మొత్తం కలిపి 7వేల రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు ఉదయం 6 గంటల నుండి అందిస్తున్నారు. పెన్షన్ అందుకుంటున్న  అవ్వ,తాతలు మరియు ఇతర ఇతర లబ్ధిదారులు ఆనందంతో తబ్బిబౌతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్ల కొండలరావు ఎమ్మార్పీఎస్ నాయకులు యర్రా  నాగమల్లేశ్వరరావు మరియు స్థానిక నాయకులు గుంజే శ్రీను, పిట్ల రామస్వామి, జానంపేట పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author