PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైలుప్పల షఫీయుల్లా కు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేసిన తెలుగువారి ఆత్మగౌరవం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102 వ జయంతి సందర్భంగా భారతీయ సాహిత్య ఫౌండేషన్ వారిచే ఈనెల 28వ తేదీన హైదరాబాద్ నగరం నందలి సుందరయ్య భవన్ నందు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బిక్కీ కృష్ణ  కర్నూలు జిల్లా రంగస్థల కళా సేవకులు బైలుప్పుల షఫీయుల్లాకు ఎన్టీఆర్ పురస్కారం దక్కిందని  తెలిపారు. కర్నూలు జిల్లా నందు దాదాపు 30 సంవత్సరాలుగా సమాజ సేవ కళా రంగం నందు రాష్ట్ర స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వికలాంగుల, మహిళల, బాలల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం, విద్య, వైద్య సేవలు, జిల్లా రంగస్థల విశిష్ట సమాజ సేవకులు బైలుప్పల షఫీయుల్లా కు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ నందు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోబోతున్నందుకు కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులు సేవా సమాజాలు అభినందనలు తెలియజేశారు.

About Author