PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాడిపత్రి అసెంబ్లీ టిడిపి ఎన్నికల పరిశీలకుడిగా మాజీ జడ్పీ చైర్మన్

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : అనంతపురం జిల్లా, తాడపత్రి అసెంబ్లీ టిడిపి ఎన్నికల పరిశీలకునిగా మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు ను టిడిపి అధిష్టానం నియమించారు. దీంతో శనివారం మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు  మాట్లాడుతూ, తాడపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేశు, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, టిడిపి నాయకులు రామలింగాయపల్లి హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author