PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందీశ్వరుని సన్నిధిలో  ఏపీ, కర్ణాటక  బ్యాంకు ఉన్నతాధికారులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది సన్నిధిలో శనివారం ఇద్దరు ఏపీ , కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఉన్నత స్థాయి అధికారులు పూజలు నిర్వహించారు. ఏపీ కెనరా బ్యాంక్ జిఎం ఐ పాండురంగ మిథన్ ,కర్ణాటక రాష్ట్రానికి చెందిన చీఫ్ జనరల్ మేనేజర్ బీపీ జాకప్ పూజలు నిర్వహించారు. వారికి విడివిడిగా ఆలయ ఏఈఓ మధు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దృశ్యాలు వతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, మేమంటో వారికి అందజేశారు . ఈ కార్యక్రమంలో కర్నూలు కెనరా బ్యాంక్ ఆర్ఎం సుశాంత్ కుమార్ ఆలయ ఏఈఓ మధు ఆలయ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి వేద పండితులు నాగేశ్వర శర్మ, హనుమంత్ కెనరా బ్యాంక్ క్షేత్ర సహాయకుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author