PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేను కలిసిన అధికారులు..కిటకిటలాడిన మాండ్ర స్వగృహం

1 min read

-ఎమ్మెల్యే సన్మానించిన అధికారులు

-గౌరు దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన నెత్తి కొప్పుల ప్రసాద్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయ సూర్య ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు భారీ సంఖ్యలో రావడంతో అల్లూరు గ్రామంలోని నంద్యాల పార్లమెంటు ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి స్వగృహం కిటకిటలాడింది.ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ నెత్తి కొప్పుల ప్రసాద్,ఎల్ఐసి రిటైర్డ్ డెవలప్మెంట్ అధికారి మాధవరం యేసురత్నం లు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, మాండ్ర  శివానందరెడ్డి లను పూలమాలవేసి దృశ్యాలువతో ఘనంగా సన్మానించారు. అంతేకాక నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా,నందికొట్కూరు,మిడుతూరు,పగిడ్యాల, కొత్తపల్లి,పాములపాడు తదితర మండలాలకు చెందిన రెవెన్యూ,ఎన్ఆర్ఈజీఎస్, వ్యవసాయ శాఖ,ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్,వెలుగు శాఖలకు సంబంధించిన అధికారులు ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన నూతన ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి లకు పుష్పగుచ్చం అందజేసి పూలమాలవేసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కర్నూలులోని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వెంకట రెడ్డి స్వగృహంలో దంపతులను ఇరిగేషన్ డీఈ నెత్తి కొప్పుల ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author