PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుప్రీంకోర్టు తీర్పుపై.. సంబరాల్లో ఎమ్మార్పీఎస్

1 min read

పల్లెవెలుగు  వెబ్  నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో ఎంఆర్ పిఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.గురువారం ఉదయం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు గూడెం సామన్న మాదిగ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు గూడెం ఆనందరాజు గ్రామంలో మధ్యాహ్నం టపాకాయలు కాలుస్తూ ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కలిపిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు హుస్సేన్ నరసింహ గౌడ్,శబ్బు, అబ్దుల్లా,కర్ణ,మాల మహానాడు చౌట్కూరు అధ్యక్షుడు తేనె మధు,ఎల్లారెడ్డి,జనసేన మధు తదితరులు పాల్గొన్నారు.

About Author