PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీతోనే…రాష్ట్రం అభివృద్ధి…

1 min read

సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు

  • కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి  ఇంతియాజ్​

కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్రంలో మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్​. బుధవారం నగరంలోని ఎస్వీఆర్ హోటల్​ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కర్నూలు నంద్యాల జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రామ సుబ్బా రెడ్డి, కర్నూలు వైసిపి  పార్లమెంట్ అభ్యర్థి బి వై రామయ్య, ఎస్ వి మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయనమ్మ,  సీనియర్ నాయకులు అహ్మద్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఇంతియాజ్​ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం రీజనల్​ కో ఆర్డినేటర్ రామసుబ్బయ్య మాట్లాడుతూ కర్నూలులో మరోసారి వైసీపీ జెండా ఎగరవేయాలని, ఇందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.

About Author