PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరులో పృథ్వి టయోటా కార్ షోరూమ్ ప్రారంభం

1 min read

ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బలేటి చంటి

ఖాతాదారులకు ఉత్తమమైన సేవలు అందించడమే మా లక్ష్యం

సంస్థ చైర్మన్ ఎం రమేష్ బాబు,

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎం ఆర్ బి ఆటో లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పృథ్వీ టయోటా షోరూం ఎంతో అట్టహాసంగా బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) షోరూమ్ ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రతిష్టాకరమైన టయోటా టిస్పర్సు కార్ షోరూంను ఏలూరులో ప్రారంభించడం టయోటా కార్ల అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇది ఒక నూతన అధ్యాయానికి ప్రారంభమన్నారు. పృద్వి టయోటా షోరూం తమ ఖాతాదారుల అభిమానాన్ని పొందాలని,  ఖాతాదారులకు ఉత్తమమైన సేవలను అందించాలని ఆకాంక్షించారు.  ఏలూరులోని పృథ్వీ టయోటా నూతన కార్ షోరూమ్ లో టయోటా సంస్థకు చెందిన ఇన్నోవా, ఫార్చునర్,   హై రైడర్, గ్లాంజా,  రోమియాన్ తదితర కార్లు అందుబాటులో ఉంటాయి. తొలుత పృద్వి టయోటా సంస్థ చైర్మన్ ఎం రమేష్ బాబు,  ఎండి ఎం పూర్ణచంద్ర పృద్వి,  సీఈఓ పి కిరణ్ కుమార్ షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు సాదర స్వాగతం పలికారు.  టయోటా సంస్థ తరఫున మహారాట్ సాన్, నిఖిల్ సాన్, శశికాంత్ సాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాట్ సాన్ మాట్లాడుతూ టయోటా సంస్థ  షోరూమ్ లలో ఏలూరు షోరూం నాలుగవది అన్నారు.  తొలుత రాజమండ్రి, కాకినాడ నగరాల్లో ప్రారంభించామని,  ఈ రోజున ఉదయం తణుకులో, సాయంత్రం ఏలూరులోనూ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.  రేపు భీమవరంలో కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి నాయకులు  ఎం.ఆర్.డి. బలరాం,  పూజారి నిరంజన్,  అమరావతి అశోక్, ఆర్నెపల్లి తిరుపతిరావు, నగరంలోని ప్రముఖ వ్యాపారులు, ఖాతాదారులు పాల్గొన్నారు.

About Author