PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి, సంక్షేమ‌మే మా ల‌క్ష్యం.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్‌

1 min read

టిడిపిలో చేరిన వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యద‌ర్శి రామ‌కృష్ణ‌, ప‌లు ప్రాంతాల‌ మహిళ‌లు, యువ‌కులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అభివృద్ధి, సంక్షేమ‌మే ల‌క్ష్యంగా తాము ముందుకు వెళ‌తామ‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని వెలుగు ఎమ్మార్పీఎస్ మ‌రియు మ‌హిళా భ‌ద్రత వ్యవస్థాపక అధ్యక్షుడు, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యద‌ర్శి రామ‌కృష్ణతో పాటు 45, 46వ వార్డుల‌కు చెందిన మ‌హిళ‌లు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంత‌రం 14వ వార్డుకు చెందిన యువ‌కులు శ్రీనివాసులు, రాజేష్‌, ముర‌ళి, చైత‌న్య‌, చిత్తారి వీధికి చెందిన శ్రీదేవి, మ‌ణి, 12వ వార్డుకు చెందిన అఫ్రోజ్, మెహ‌బూబ్ బాషా, తాహిద్, షాహిద్, ఆరిఫ్‌, 45వ వార్డుకు చెందిన యువకులు మహేష్ శంకర్, మని వైసీపీ నుండి, తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పాటు ప్రజ‌ల‌కు స‌రైన ప‌రిపాల‌న అంద‌లేద‌న్నారు.  ప్రజ‌ల క‌ష్టాలు తీరి సంక్షేమం, అభివృద్ధి అందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాల‌న్నారు. చంద్రబాబు నాయుడును సీఎం చేసుకున్నప్పుడే ఏపీకి భ‌విష్యత్తు ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌మ ప్రభుత్వంలో అన్ని వ‌ర్గాల ప్రజ‌ల‌కు న్యాయం జ‌రిగింద‌న్నారు. పేద‌ల‌కు ఇళ్లు, ఇళ్ల ప‌ట్టాలు అందించిన ఘ‌న‌త చంద్రబాబు నాయుడుకే ద‌క్కింద‌న్నారు. మ‌ళ్లీ అలాంటి పాల‌న రావాలంటే ప్రజ‌లంద‌రూ ఓటు హ‌క్కును త‌ప్పకుండా వినియోగించుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఇక క‌ర్నూల్లో ప్రజ‌ల‌కు మంచి చేసేందుకే తాను రాజ‌కీయాల్లో ఉన్నట్లు టి.జి భ‌ర‌త్ తెలిపారు. త‌న‌కు ఎమ్మెల్యేగా ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ త‌న విజ‌యం కోసం కృషి చేయాల‌న్నారు. ఆ త‌ర్వాత ఐదేళ్ల పాటు ప్రజ‌ల‌కు మంచి పాల‌న అందించే బాధ్యత తాను తీసుకుంటాన‌ని టి.జి భ‌ర‌త్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత‌లు అబ్బాస్, రామాంజ‌నేయులు, విజ‌య‌ల‌క్ష్మి, వెలుగు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రామంజి, జమ్మన్న, శివ, జనార్ధన్, సందీప్, శేఖర్, రాముడు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author