PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి టీజీ భరత్

1 min read

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి టీజీ భరత్

సమస్యలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  దివ్యాంగులకు కేటాయించిన స్థలాలను వైసీపీ నేతలు అక్రమంగా కబ్జా చేసి వ్యభిచారం నిర్వహిస్తుంటే.. దానిపై  కేసులు పెట్టినా నాడు  పోలీసు అధికారులు పట్టించుకోకపోగా తిరిగి తమపైనే అక్రమ కేసులు బనాయించి వేధించారని.. కబ్జాకు గురైన దివ్యాంగుల ఇంటి స్థలాలను ఇప్పించి తనపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని  తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షులు మండవ వెంకట్రావు నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు.  వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నరసింహప్రసాద్, తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చిన్నబాబులు అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.    పెద్దిరెడ్డి కజిన్ బ్రదర్ అయిన పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి అక్రమంగా తమ భూములను  ఆక్రమించుకున్నారని.. ఈ దానికి వైసీపీ పాలనలో ఉన్న తహశీల్దార్, వీఆర్వోలు సహకరించారని.. దీనిపై విచారించి.. తమ భూమిని తమకు ఇప్పించాలని అక్రమార్కులకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకొని భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని  చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన కె. చోలేశ్వరరావు విజ్ఞప్తి చేశాడు. తిరుపతి జిల్లా వరదయ్య పాలెం మండలం  ఇంధిరానగర్ కు చెందిన నూతలపాటి జయచంద్రనాయుడు విజ్ఞప్తి చేస్తూ.. తాను టీడీపీ కార్యకర్తను కావడంతో తనను వైసీపీలో చేరమంటే చేరలేదని వైసీపీ అధికారం వచ్చాక తనపై కక్షగట్టి  తన ఇంటి వెళ్లే దారిని రెండు వైపులా మూసివేశారని.. అప్పటి అధికారులు కూడా వైసీపీ నేతలకే కొమ్ముకాశారని.. దారికి అడ్డంగా ఉన్న గోడలను తొలగించి దారి మార్గాన్ని ఏర్పాటు చేయాలని నేతలకు విజ్ఞప్తి చేశాడు. తన స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేయాలని చూశారని… దానిపై కోర్టుకు వెళుతుంటే దాడి చేశారని.. అంతే కాకుండా కంప్లేంట్ చేయడానికి వెళితే సీఐ శ్రీహరి వైసీపీ నేతలకు తొత్తుగా వ్యవహరించి.. కంప్లేయింట్ మార్చి రాసి బలవంతంగా తనచేత సంతకాలు చేయించడమే కాకుండా.. మరుసటి రోజు ఇచ్చిన కంప్లేట్ వాపస్ తీసుకోవాలని సీఐ, ఎస్ఐ హరూన్ బాషా లు బలవంతంగా స్టేషన్ కు తీసుకెళ్లి  వైసీపీ నేతలకు అనుకూలంగా  అగ్రిమెంట్ తయారు చేయించి  కోటిన్న ఇవ్వాలంటూ బాండ్లపై సంతకాలు చేయించుకున్నారని.. తన ఇంటికి వచ్చి ఏడు లక్షల నగదు 31 లక్షల ప్రామిసరీ నోట్స్  తీసుకెళ్లారని.. దీనిపై నోరు తెరిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని నాడు బెదిరించారని.. ఇటువంటి పోలీసు అధికారులను ఉద్యోగాల్లో లేకుండా పర్మినెంట్ గా తొలగించి తన భూమిని కబ్జా చేయాలని చూసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం చంద్రగిరికి చెందిన జి. మధు విజ్ఞప్తి చేశాడు.  ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తెల్లబాడు గ్రామానికి చెందిన చలిచమ శంకరావు విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే లో తమభూమని అక్రమంగా వీఆర్వో మరోకరి పేరుమీదకు మార్చారని.. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా తనకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకుని తనకు తన భూమిని ఇప్పించాలని వేడుకున్నారు.  జడ చక్రి, కె. మహేష్ అను వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా తమ ఇంటిని కూల్చడమే కాకుండా రౌడీలతో తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని..  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. వాళ్లకు అడ్డు వెళితే తలలు తీసేస్తామని బెదిరిస్తున్నారని  తమకు ప్రాణ రక్షణ కల్పించి బెదిరిపుంలకు దిగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  తిరుపతి మండలం తిరుపతికి చెందిన కె.సి. సునీత విజ్ఞప్తి చేశారు.నెల్లూరు జిల్లాలోని కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన దాదాపు 230 మంది కార్మికులు నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. షుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో తామంతా రోడ్డున పడ్డామని.. 2019 లో జగన్ రెడ్డికి  తమ గోడు  చెప్పుకోగా..  ఒక్కొక్కరికి రూ.  పదిలక్షలు కాంపన్సేషన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని.. తమను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.తనను మోసం చేసి పెళ్లి చేసుకున్న కాపురానికి పనికిరాని భర్త నుండి విడాకులు అడుగుతుంటే.. తనను తన తల్లిని చంపేస్తామని బెదిరిస్తున్నారని.. తమ ప్రాణాలు కాపాడి.. విడాకులు ఇప్పించవలసిందిగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంకు చెందిన ఓ మహిళ నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలానికి చెందిన  వెంకటరామయ్య విజ్ఞప్తి చేస్తూ..  వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో ఉన్న తన భూమిని వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని..  భూ కబ్జాపై రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఆదేశించి తమ భూములు ఇప్పించాలని వేడుకున్నారు.ఇంటికి కాంపౌండ్ గోడ కట్టుకోవడానికని లక్ష రూపాయాలు పెట్టి తెచ్చుకున్న రాళ్లను దొంగిలించారని.. బంధువుకు బాగోలేకుంటే చూడటానికి వెళ్లి వచ్చేసరికి రాళ్లను మాయం  చేసి ఇంటి పరిసరాల్లో పెరుగుతున్న చెట్లను నరికేసి తీసుకెళ్లారని.. ఈ దొంగలపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా చెన్నూరు మండలం గుర్రంపాడు గ్రామానికి చెందిన మర్రి అరుణా దేవి విజ్ఞప్తి చేశారు.ప్రకాశం జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన రిటైర్డ్ మరియు విఆర్ఎస్ ఉద్యోగులు  విన్నవించుకుంటూ..  తాము వివిధ పద్దుల కింద కంపెనీ నుండి పదవీ విరమణ ప్రయోజనాలను పొందవలసి ఉందని.. రావాల్సిన బెన్ఫిట్స్ రాకపోవడంతో  వృద్ధాప్య వయస్సులో ఇబ్బందులు పడతున్నామని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వారు వేడుకున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *