PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి  జన్మదిన వారోత్సవాల్లో రక్తదానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి  జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబు, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి హాజరై రక్తదానం చేసిన మెగా అభిమానులను అభినందించారు. వారు మాట్లాడుతూ అభిమాన సంఘాలు అంటే అల్లరిగా తిరిగే సమయాల్లో మెగాస్టార్ చిరంజీవి సేవా మార్గం వైపు మళ్ళించి అభిమానులు సేవకు అంకితం కావాలని స్ఫూర్తిని మాలో నింపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంజునాథ్, బజారి, సుధాకర్, షబ్బీర్, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

About Author