PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విభిన్న ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అండగా ఉంటారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి భరత్ అన్నారు. పింఛన్ రూ.౩ వేల నుండి రూ.6  లకు పెంచినందుకు శనివారం నగరంలోని టి.జి భరత్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పింఛన్ పెంపుతో వికలాంగులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు. వికలాంగుల జీవితాల్లో సీఎం చంద్రబాబునాయుడు వెలుగులు నింపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్, టిడిపి విభిన్న ప్రతిభావంతుల విభాగం జిల్లా అధ్యక్షులు కుమ్మరి మద్దిలేటి, జిల్లా ప్రధాన కార్యదర్శి మక్బుల్ బాషా, జేఏసీ నాయకులు నాగరాజు, ఈరన్న, శివ, శంకర్, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

About Author