PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొక్కు తీర్చుకున్న పాణ్యం నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని దుర్వేసి గ్రామ టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు అంగజాల కృష్ణ యాదవ్ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు , పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గా శ్రీమతి గౌరు చరిత రెడ్డి  గెలిస్తే  బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకుంటానని ఆరోజు కోరుకోవడం. కోరిక నెరవేరడంతో  శనివారం నాడు తెలంగాణ బిచుపల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ ,అంగజాల చిన్న శ్రీనివాసులు యాదవ్ , అంగజాల మునిస్వామి యాదవ్ మరియు ఐటీడీపి రాజశేఖర్ పాల్గొన్నారు.

About Author