PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

1 min read

ఆమె వెంట పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు,పార్టీ శ్రేణులు..

ఒక్కసారి అవకాశం ఇవ్వండి, హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి

లావణ్య వెంట జననీరాజనం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికలలో  ఏలూరు పార్లమెంటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిని కావూరి లావణ్య  పాదయాత్ర గా బయలుదేరి ఎన్నికల అధికారి వై ప్రసన్న వెంకటేష్ కి నామినేషన్ దాఖలు చేశారు.      శుక్రవారం లావణ్య  క్యాంప్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ, ధ్వనుల హోరుతో, కార్యకర్తల నృత్యాలతో నగరంలో పండుగ వాతావరణం తలపించేలా ఎంపీ అభ్యర్థి లావణ్య కి భారీ ఊరేగింపు పాదయాత్ర ప్రారంభ మయ్యింది. మీ అందరి అభిమానంతో అధిష్టానం ఆదేశించిన అభ్యర్థులకు,నా గుర్తు హస్తం కు ఓటేసి  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం చేకూర్చాలని శిరస్సు వంచి నమస్కరించి అభివాదాలు చేస్తూ పాదయాత్రను ప్రారంభించారు.రహదారుల మీదుగా ఎన్నికల అధికారి  కార్యాలయం వరకు కొనసాగింది. కావూరి లావణ్య మండుటెండ సైతం లెక్కచేయకుండా  పాదయాత్ర గా భారీ వూరేగింపు తో చేరుకొన్నారు. పాదయాత్ర పాల్గొన్న ప్రతి ఒక్కరూ  చివరి వరకు అదే ఉత్సాహంతో జోష్ నింపారు. మహిళలు కూడా అడుగడుగునా హరతులతో, పూల వర్షం కురిపించారు. ఎంపీ అభ్యర్థి గా కావూరి లావణ్య ఎన్నికల అధికారి వై ప్రసన్న వెంకటేష్ కి తన నామినేషన్ పత్రం దాఖలు  చేసారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు రాజనాల రామ్మోహన్ రావు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

About Author