PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారుమంచాల వైసీపీ  నాయకులు టిడీపీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మందడి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ  నాయకులు చల్లా రమేష్ రెడ్డి, ఎంపీటీసీ బాలరాజు,చిన్న పాప రాయుడు,ఎం శివ,మహేశ్వర్ రెడ్డి తదితర కుటుంబాలు నందికొట్కూరు పట్టణంలో శనివారం సాయంత్రం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆధ్వర్యంలో వాళ్లు టిడిపిలో చేరారు. వీరందరినీ ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి.ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధికి తన వంతుగా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మీరు ఎప్పుడైనా సరే నా దగ్గరికి వస్తే నీకున్న సమస్యలు తీర్చుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వారితో అన్నారు.తర్వాత ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో లింగేశ్వర రావు, అవుజ చంద్రన్న,అనకలి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

About Author