PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోషల్ మీడియా కన్వీనర్ గా పసుల శ్రీనివాస్..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వాల్మీకి బోయ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ గా నందికొట్కూరు పట్టణానికి చెందిన పసుల శ్రీనివాస్ నాయుడు(ఏబీవీబీఎస్) ను నియమించారు.రాష్ట్ర బోయ వాల్మీకి సంఘం అధ్యక్షులు డాక్టర్ విక్రమ్ నాయుడు,రాష్ట్ర జనరల్ సెక్రటరీ జక్కుల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పసుల శ్రీనివాస్ నాయుడు ను రాష్ట్ర కమిటీ నియమించినట్లు  శ్రీనివాస్ తెలిపారు.అదే విధంగా కమిటీ సభ్యులైన క్రాంతి నాయుడు కు,నంద్యాల జిల్లా కార్యదర్శి రామకృష్ణ తదితరులకు శ్రీనివాస్ నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.వాల్మీకి జాతి బిడ్డగా వాల్మీకి జాతి అభ్యుదయానికి పాటు పడతానని వాల్మీకి జాతిని ఎస్టీ జాబితాలో చేర్చుటకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీసుకు వెళ్లే విధంగా కృషి చేస్తానని అంతే కాకుండా వాల్మీకి సంఘానికి సంబంధించిన విషయాలు నియోజకవర్గంలో ఉన్న వాల్మీకి సోదరులకు తెలియపరచే విధంగా సోషల్ మీడియాలో నా వంతుగా కృషి చేస్తానని శ్రీనివాస్ నాయుడు సోమవారం పాత్రికేయులతో అన్నారు.వాల్మీకులను చైతన్య పరుస్తూ సంఘాన్ని ముందుకు తీసుకు వెళ్తానని అంతే కాకుండా వాల్మీకులకు ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి మరియు జిల్లా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలను పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *