PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపి లో కింగ్ మేకర్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్

1 min read

మంత్రాలయం జనసేన  ఇంచార్జ్ బి. లక్ష్మన్న

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ గా ఎదగడం జరిగిందని మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న అన్నారు.  మంత్రాలయం లోని తన స్వగృహానికి జనసేన కార్యకర్తలు రావడంతో వారి సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్  జీరో స్థాయి నుంచి  రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ, కింగ్ మేకర్ గా అవతరించి  రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే కింగ్ మేకర్ గా అవతరించారని తెలిపారు. జనసేన పార్టీకి ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను 100%  గెలిపించుకున్నారని తెలిపారు. పిఠాపురం లో కూడా 70 వేల  లకు పైగా మెజార్టీతో విజయం సాధించడం జరిగిందని తెలిపారు.  పవన్ కళ్యాణ్ ని అవహేళన చేసిన వారిని చులకనగా మాట్లాడిన వారిని మాటలతో కాదు చేతలతో బుద్ధి చెప్పారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడబోతుందంటే  అది పవన్ కళ్యాణ్  తీసుకున్న నిర్ణయాలే ముఖ్య కారణమని తెలిపారు.  రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ  కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా జనసేన సైనికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఇక రాబోయేది మన ప్రభుత్వమే కనుక ఆంధ్రప్రదేశ్ ని సువర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. మంత్రాలయం నియోజకవర్గం లో ఎన్డీఏ కూటమి జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు బాగా కష్టపడ్డారని తెలిపారు. వాళ్లకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలుతెలుపుతున్నాను. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ లో మంత్రాలయం నియోజకవర్గం లో  జనసేన పార్టీ బలోపేతానికి జనసేనతో పార్టీ కార్యకర్తలు అందరూ సైనికుల పనిచేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు  బివి రవిచంద్ర, ప్రకాష్, రాజశేఖర్, కాజా, నరసింహ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author