PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజ‌ల క‌ష్టాలు తీరిపోవాల‌ని శ్రీరాముడిని కోరుకున్నా..

1 min read

క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

శ్రీరామ న‌వ‌మి వేడుక‌ల్లో పాల్గొన్న టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు న‌గ‌రంలోని ప‌లు ఆల‌యాల్లో నిర్వహించిన శ్రీరామ న‌వ‌మి వేడుక‌ల్లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ పాల్గొన్నారు. ముందుగా కొత్తపేట కోదండ రామ స్వామి ఆల‌యంలో పూజ‌లో పాల్గొన్నారు. అనంత‌రం ష‌రాఫ్ బ‌జార్, పాత‌బ‌స్టాండు, మించిన్ బ‌జార్‌, పూల‌బ‌జార్, దండ‌గేరి, పెద్ద ప‌డ‌ఖానా, బాపూజీ న‌గ‌ర్‌, బుధ‌వార‌పేట‌, శ్రీరామ్ న‌గ‌ర్, బి.క్యాంపు విజ్నాన మందిర్, అరోరా న‌గ‌ర్ రాజ‌రాజేశ్వరి ఆల‌యం, సీతారాం న‌గ‌ర్, పాత‌బ‌స్టాండులోని ఆల‌యాలను సంద‌ర్శించారు. అక్కడ నిర్వహించిన సీతారాముల కల్యాణంలో ఆయ‌న పాల్గొన్నారు. అనంత‌రం భ‌క్తుల‌కు భోజ‌నం వ‌డ్డించారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని తాను కోరుకున్నట్లు టి.జి భ‌ర‌త్ తెలిపారు. ప్రస్తుతం ప్రజ‌లు ఎదుర్కొంటున్న నీటి క‌ష్టాలు తీరిపోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ క‌ర్నూలు ఇంచార్జి సూర్య‌ప్ర‌కాష్‌, జ‌న‌సేన ఇంచార్జి అర్షద్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author