PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ అలంకరణ ల కు విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరి

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  వినాయక చవితి పర్వదిన సందర్భంగా వినాయక మండపాల్లో ఏర్పాటు చేసే విద్యుత్ అలంకరణ లకు విద్యుత్ శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని మహానంది మండలం విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. విద్యుత్ శాఖకు మీసేవ కేంద్రాల ద్వారా  1100 రూపాయలు చలానా రూపంలో చెల్లించి రసీదులు సంబంధిత విద్యుత్ శాఖ కార్యాలయాల్లో అందజేస్తే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అతిక్రమించి ఏవైనా చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పమన్నారు. వినాయక మండపాల్లో విద్యుత్ వైర్లు జాయింట్లు మరియు అర్తులు లేకుండా జాగ్రత్తలు వహించాలని ఏవైనా సంఘటనలు జరుగుతే అందుకు సంబంధించి ఆ వినాయక మండపం నిర్వాహకుల పైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం లోపు 1100 రూపాయలు మీసేవ కేంద్రాల్లో చెల్లించి రసీదులను సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు కానీ సిబ్బందికి కానీ అందజేయాలని ఏ ఈ ప్రభాకర్ రెడ్డి ఆయా గ్రామాల్లోని వినాయక ఉత్సవాల కమిటీ వారికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *