PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేదవతి నది నుండి ఇసుకను తరలించేందుకు అనుమతి ఇవ్వాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  హొళగుందమండలంలోని మార్లమడికి గ్రామంలో గల వేదవతి నది నుండి ఇసుకను తరలించుకునేందుకు అనుమతినివ్వాలని ఎంపీపీ నూర్జహాన్ బి, జడ్పిటిసి కె బొజ్జమ్మ, వైస్ ఎంపీపీలు మహదేవమ్మ. గాదెమ్మ, ఎంపీటీసీలు మల్లికార్జున ,కెంచప్ప, రాజేశ్వరి, వీరేశ, ఉరుకుం దప్ప, శివన్న తదితరులు మంగళ వారం కర్నూలు జిల్లాలోని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో ప్రజల అవసరాల నిమిత్తం ఇళ్ల నిర్మాణం, సిసి రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల మరమ్మత్తులు మరియు దినసరి వారి అవసరాల నిమిత్తం పాత ఇల్లు మిద్దెలు మరమ్మత్తుల కొరకు ఇసుక లేనందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మండలంలో గల మార్లమడికి గ్రామం వేదవతి నది నుండి ఇసుకను తరలించుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు మరియు మైనింగ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని వారిని సవినయంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా, జడ్పిటిసి బావ శేషప్ప, నాయకులు అశోక్, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *