PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే పార్థసారథి కి వినతి

1 min read

పల్లెవెలుగు వెబ్ హోళగుంద :  వందవాగిలి గ్రామం నుండి ఢాణపురం వరకు వచ్చే రోడ్డు చాలా అద్వానంగా ఉంది  వందవాగలి గ్రామం నుండి ప్రతిరోజు పాఠశాలకు చిన్నపిల్లలు బస్సులోను ఆటోలోనూ ఆదోనికి వచ్చి వెళ్లడం జరుగుతుంది. రోడ్డు బాగాలేక పోవడం వల్లనే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పాఠశాలకు అలాగే ఇంటికి  సమయంకు చేరుకోలేకపోతున్నారు. అలాగే గ్రామ ప్రజలు ఆరోగ్య సమస్యలకి ఆసుపత్రులకు అవసరాల కొరకు ఆదోనికి రావటానికి  చాలా ఇబ్బంది ఉండదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వంలో ఈ సమస్యను చెప్పిన కూడా సమస్య పరిష్కారం కాలేదు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం వందవాగిలి నుంచి ఢాణపురం వరకు రోడ్డు వేయాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి కి వందవాగిలి గ్రామ నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బొంపల్లి నాగప్ప,బి.నాగప్ప,కె.ఈరన్న,చిగిలి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author