PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ట్రిపుల్ ఐ.టి సమస్యల పై కేంద్ర విద్యా శాఖ మంత్రి కి వినతి

1 min read

ఎం.పి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు లోని ట్రిపుల్ ఐ.టి కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు..ఢిల్లీలో ని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ తో భేటి అయిన ఎం.పి.. ట్రిపుల్ ఐ.టి కళాశాలలో ఖాళీగా ఉన్న 36 బోధన మరియు బోధనేతర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అలాగే కళాశాలలో నీరు, రోడ్లు, కరెంట్ సమస్యను పరిష్కరించి  కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు..ట్రిపుల్ ఐ.టి కళాశాల సమస్యల పై సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎం.పి నాగరాజు తెలిపారు.

About Author