PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొక్కలే పర్యావరణ పరిరక్షణ

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మొక్కలే పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడతాయని యూఎస్ అగ్రిసీడ్ కంపెనీ  టిఎస్ యం రాఘవేంద్ర అన్నారు. గురువారం 78 వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మండల పరిధిలోని చిలకలడోన గ్రామ శివారులో ఉన్న దత్తాత్రేయ స్వామి దేవాలయంలో యూఎస్ అగ్రిసీడ్ కంపెనీ  అధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచడం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. మొక్కలు వాతావరణ కాలుష్యం బారిన పడకుండా కాపాడాతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డి ఓ లక్ష్మీకాంత ,హరికృష్ణ,  మాజీ సర్పంచ్  హనుమంతు, వాల్మీకి నరేంద్ర, ప్రతాప్ రెడ్డి,గుజ్జుల ఈరన్న, ఎం మహానంది, జి ఈరన్న, రైతులు పాల్గొన్నారు.

About Author