PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  మొక్కులు పర్యావరణాన్ని కాపాడతాయని మాధవరం మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ కోసం మొక్క అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం నాటిన ప్రతి మొక్క చెట్టు అయ్యేంతవరకు  అన్ని విధాలుగా మొక్కలకు తోడుండాలని  ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాధవరం మబుభాష,కేశవయ్య, ఉరుకుందు, వెంకటేష్,జమీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *