PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పి ఎం జె జె బి వై భీమ బాధిత కుటుంబానికి ఆర్థిక ఆసరా..బ్యాంకు మేనేజర్

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  వెలుగోడు   పీఎం జేజే బి వై భీమ బాధిత కుటుంబానికి ఆర్థిక సహారా అవుతుందని కెనరా బ్యాంకు సీనియర్ మేనేజర్ సూర్యదేవరనాయక్ అన్నారు. వెలుగోడు మండల మోత్కూరు గ్రామ నికి చెందిన స్వామి నాయుడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు స్వామి నాయుడు కెనరా బ్యాంకులో పీఎంజే జె బి వై భీమ కు సంబంధించిన ప్రీమియం చెల్లించి ఉండడంతో ఆ వ్యక్తికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లైమ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా మోతూరు గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్ పథకాలపై  డిజిటల్ బ్యాంకింగ్ పై, ప్రైవేట్ ఆర్థిక సంస్థల మోసాలపై ,ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై ,అటల్ పెన్షన్ యోజన రిజర్వ్ బ్యాంక్ అంబుర్స్మెంట్ అవగాహన కల్పించారు.అనంతరం స్వామి నాయుడు కు నామిని అయిన భార్య సుమిత్రమ్మకు భీమా కి సంబంధించిన రెండు లక్షల రూపాయల చెక్కును బ్యాంకు మేనేజర్ అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బీమాకు సంబంధించిన డబ్బులు తమ కుటుంబానికి ఎంతగానో తన కూతురు కొడుకు విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఇన్సూరెన్స్ మొత్తము తొందరగా నా యొక్క అకౌంట్ కు జమ చేసిన బ్యాంకు మేనేజర్ సూర్యదేవర నాయక్ కి ,ఎస్ ఎస్ ఆర్థిక అక్షరాస్యత  కేంద్రం వాయిస్ డైరెక్టర్ ఆంజనేయులు కు ,ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ కుమార్ కు ,కౌన్సిలర్లకు ధన్యవాదములు తెలిపారు.

About Author