PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోతులపాడు సర్పంచ్ టిడిపి లోకి..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతులపాడు వైసీపీ గ్రామ సర్పంచ్ పల్లె నిర్మలమ్మ నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో సోమవారం మధ్యాహ్నం బైరెడ్డి స్వగృహం నందికొట్కూరులో బైరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు.సర్పంచ్ తో పాటుగా పల్లె శివానందరెడ్డి రామకృష్ణారెడ్డి,స్వామిరెడ్డి, శ్రీనివాసులు,రామకృష్ణ తదితర కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.వీరందరిని బైరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.గత ప్రభుత్వ హయాంలో సర్పంచులకు నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధికి గ్రామాలు ఆమడ దూరంలో ఉన్నాయని సర్పంచ్ అన్నారు.టిడిపి ప్రభుత్వం తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో పార్టీలో చేరినట్లు సర్పంచ్ మరియు పల్లె శివానందరెడ్డి అన్నారు.టిడిపి ప్రభుత్వం ఇంకా బలపడేందుకు కృషి చేయాలని ఎవరికి ఇచ్చే విలువ వారికి ఇస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని గ్రామాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు, నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author