PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆగస్టు 15 న పల్లెలకు  ప్రైవేటు స్కూల్ బస్సులను నడపాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ప్రైవేటు స్కూల్ విద్యార్థులు ఆగస్టు 15 వ తేదీన స్కూలుకు రావడానికి ప్రైవేటు పాఠశాల యాజమాన్య  ప్రతీ రోజు పిల్లలను ఎలాగైతే స్కూలుకు పిలుచుకునీ వస్తారో అదే విదంగానే జెండా ఆవిష్కరణ కోసం పల్లెటూరి నుంచి విద్యార్థులు రావడానికి బస్సులను వదలాలనీ కోరుకుంటున్నాము.ఆలూరు నియోజకవర్గం పరిధిలో వున్న ప్రైవేటు స్కూల్ వారు సంవత్సరం పూర్తి ఫీజులు మాత్రం కట్టించుకుని….ముఖ్య మైన రోజులు అంటే ఆగస్టు15,జనవరి26, ఇలాంటి రోజు మాత్రం పల్లెలకు తమ పాఠశాల బస్సులను పంపించకుండా లోకల్లో వున్న తమకు సంబంధించిన విద్యార్థులను పిలిచుకుని జెండావిష్కరణ చేసుకుని ఆ రోజు జరుగుతున్న కల్చ్యురల్ యాక్టీవిటీస్ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీని కారణంగా పల్లెటూరి నుంచి వచ్చే విద్యార్థులు మాత్రం వాటి అవగాహనం లేక అలాగే వెనుకబడే అవకాశం వుంది. కావున సంవత్సరంలో రెండుసార్లు జరిగే ఈ జెండావిష్కరణకు ఖచ్చితంగా ఎవరి పాఠశాలల్లో వారు వారు హాజరు అయ్యే విధంగా మీరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యకు సూచనలు ఇచ్చి పల్లెటూరు విద్యార్థులకు సహాయ పడగలరనీ కర్నూలు జిల్లా కలెక్టర్ ని హృదయ పూర్వకంగా వేడుకుంటున్నాము.

About Author