PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యల పరిష్కారానికి కావూరి లావణ్య హస్తం గుర్తుతో హామి..

1 min read

ఏలూరులో ఏలూరు  సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం జోరు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో అపరిష్కృతమైన ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు అభ్యర్థి  కావూరి లావణ్య  హామీ ఇచ్చారు. శనివారం ఏలూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వన్ టౌన్ ఆముదాల అప్పలస్వామి కాలనీ నుండీ ప్రారంభమయ్యి. నేరెళ్ళ రాజా కాలనీ, కైకలూరు బైపాస్ రోడ్డు వయా పాలతూము సెంటర్ వరకూ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా కావూరి లావణ్య మాట్లాడుతూ బీజేపీని గద్దె దించాలి అంటే ఇండియా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏలూరు లోక్‌సభకు తాను, ఏలూరు అసెంబ్లీ స్థానానికి సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు లు పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమములో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  రాజనాల రామ్మోహన్ రావు,  సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్,  సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య,  సిపిఐ నగర కార్యదర్సులు పి. కిషోర్ , హేమశంకర్  మరియు ఇండియా కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీగా నడుస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థుంచారు . ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్లమెంట్  అభర్థిని  కావూరి లావణ్య  హస్తం గుర్తు మరియు ఏలూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి  బండి వెంకటేశ్వరరావు  కంకి కొడవలి గుర్తులపై. ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి ఇరువురికి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరుతూ ఏలూరు నగర ప్రజలకు విజ్ఞాపన చేసారు.

About Author