PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త ప్రభుత్వంలోనైనా మా హక్కులను కాపాడండి

1 min read

ఉద్యోగుల సంఘం షెడ్యూల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నేనావత్ రాము నాయక్

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్లు:       ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వము బిజెపి జనసేన కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవసారి ముఖ్యమంత్రిగా  నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ గిరిజన సుగాలి బంజారా, ప్రజల  తరపున.  ఉద్యోగుల సంఘం షెడ్యూల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నేనావత్ రాము నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గడచిన ఐదు సంవత్సరాలలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు గురిచేసిన గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 40 నియోజకవర్గాలలో ఉన్న దాదాపు 12 లక్షల గిరిజన లంబాడి సుగాలి ప్రజలు తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ బలపరిచిన. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించు కోవడానికి ఎంతో కృషి చేశామని. దాని ఫలితంగానే ఈరోజు మంచి ఫలితాలతో మంచి నాయకులని గెలిపించు కున్నామని. అలాగే కొత్తగా ఏర్పాటు జరుగుతున్న ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రజలకు, గిరిజన ఉద్యోగులకు అన్ని విధాల అభివృద్ధి పథంలోనికి తీసుకొని వెళ్తాదని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ ఉద్యోగ సంఘం నాయకులు ఇస్లావత్ కాలు నాయక్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Author