PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరించబడును 

1 min read

– తాసిల్దార్ ప్రకాష్ బాబు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి ఫిర్యాదుదారులకు నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించబడుతుందని తాసిల్దార్ ప్రకాష్ బాబు తెలిపారు, శనివారం ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు 24 వ తేది సోమవారం ఉదయం 9 గంటల నుండి తాసిల్దార్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ( గ్రీవెన్స్ సెల్) ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించబడునని ఆయన తెలిపారు, కావున మండల ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే తాసిల్దార్ కార్యాలయమునకు వచ్చి తమ ఫిర్యాదులు తాసిల్దార్ వారికి అర్జీ రూపంలో తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోగలరని ఆయన తెలిపారు, అలాగే ప్రతి సోమవారం కార్యాలయం నందు అన్ని శాఖల అధికారులు హాజరవుతారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని ఆయన తెలియజేశారు.

About Author