PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

15 న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం

1 min read

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 15 వ తేదీ సోమవారం  కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం  జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం)కార్యక్రమం  జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

About Author