PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సంక్షేమమే మా ధ్యేయం.. ఎమ్మెల్యే బుడ్డా

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మండలంలోని గోపవరం మరియు గాజు పల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి రావడానికి మీ అందరి ఆశీర్వాదం అని ఆయా గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రస్తుతం ఆ కష్టాలన్నీ తీరిపోయాయని ఇక భయపడాల్సిన పనిలేదని నేను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సహాయ సహకారాలతో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుబాటులోనికి పారదర్శకంగా వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ముందుగా పెన్షన్లను ఇంటి వద్దనే  7, 000 రూపాయలు మొదటిసారి అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలు అమలు చేస్తామని దీనిపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ఎస్విని మాజీ ఎంపీపీ చింత నాగమణి తెదేపా యువజన నాయకుడు క్రాంతి కుమార్ శ యాదవ్, శివ , గోపవరం మాజీ సర్పంచ్ సబ్బసాని నంది రెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు ఉల్లి మధు మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, గోపవరం గని రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. 

About Author