PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు తోనే ప్రజా సంక్షేమం  సాధ్యం

1 min read

ఒకటో తారీఖు ముందే పెన్షన్లు పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం

దేశంలోనే విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్  మంత్రాలయం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే ప్రజా సంక్షేమం సాధ్యం అని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు  మంత్రాలయం, చెట్నిపల్లి ,రచ్చమరి సుంకేశ్వరి,చిలకలడోణ గ్రామాల్లో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి అధ్యక్షతన జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇంటి దగ్గరకు వచ్చి పెంచిన పెన్షన్ డబ్బులు ఇవ్వడం ప్రజలు సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యం అని  అన్నారు. ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీ చేయడం ఛారిత్రాక నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ చార్జి యల్లారెడ్డి, యువ నాయకుడు మాధవరం క్రిష్ణా మోహన్ రెడ్డి,అమర్నాథ్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, వట్టేప్ప  నరసింహులు, వట్టేప్ప సుంకప్ప, రామకృష్ణ, చిన్న భీమన్న, వనికే నాగరాజు, గురురాజ, యోబు,చెట్నిపల్లి తిక్కస్వామి గౌడ్,రవి, హనుమంతు,లక్ష్మారి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author