PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

1 min read

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న అత్యాచార దాడులపై కఠినమైన చట్టాలను చేయాలి :

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: కోల్ కత్తా లోని ఆర్జికార్ వైద్యా కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందుతులను కఠినంగా శిక్షించాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు SK.జునైద్ బాషా డిమాండ్ చేశారు.శనివారం ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి గౌడ్ సెంటర్ లో  ఘటనకు నిరసనగా PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ కోల్ కత్తాలో మెడికో విద్యార్థిని అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అలాగే మహిళలపై హింసను ప్రేరేపించే మద్యం, మత్తు పదార్థలను నిషేదించాలని ఇలాంటి దారుణమైన దాడులు పునరావుత్తం కాకుండా మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలని PDSU విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో PDSU నాయకులు రంజిత్, ఇంతియాజ్, మోహన్, రాజు శేఖర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

About Author