PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్వాలిటీ గోల్డ్​కు కేరాఫ్​ ‘జోయాలుక్కాస్’

1 min read

కస్టమర్లను ఆకట్టుకున్న ప్రత్యేక ఆఫర్లు

కర్నూలు, పల్లెవెలుగు:నాణ్యతకు.. మన్నికకు కేరాఫ్​ గా నిలిచిన జోయాలుక్కాస్​ బంగారు ఆభరణాల సంస్థ.. ప్రపంచ వాణిజ్య రంగంలో  ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.  బంగారు ఆభరణాల ప్రియుల అభిరుచికి… ఆకాంక్షకు తగ్గట్టు వజ్రాలు, ఆభరణాలు రూపొందించడంలో ప్రథమ  స్థానంలో ఉంది.  దీపావళి పండగ సందర్భంగా శనివారం కర్నూలు జోయాలుక్కాస్​ బంగారు ఆభరణాల షో రూంలో  కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్​ ఇస్తూ.. నగల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఈ సందర్భంగా కస్టమర్లు మాట్లాడుతూ  జోయాలుక్కాస్​ బంగారు ఆభరణాలు నాణ్యతగా ఉంటాయని, అతితక్కువ ధరకు విక్రయిస్తూ… బంగారు ప్రియులను అభిమానాన్ని చూరగొంటుందన్నారు.  అనంతరం కర్నూలు షోరూం మేనేజర్​ లిగేష్​ మాట్లాడుతూ  జోయాలుక్కాస్​ లో ప్రతి పండగకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తోందని,వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా నగలు రూపొందించడంలో తమ సంస్థ ప్రత్యేకత అని పేర్కొన్నారు. దీపావళి పండగ సందర్భంగా రూ.లక్ష కు పైగా విలువ చేసే డైమండ్స్​ అండ్​ అన్​ కట్​ డైమండ్స్​ కొనుగోలు చేసిన వారికి ఒక గ్రాము గోల్డ్​ కాయిన్​ ఉచితంగా ఇస్తోందని, అలాగే రూ. 50 వేలు మరియు అంతకు మించి విలువ గల గోల్డ్​ అండ్​ ప్రెషస్​ జ్యువెలరీ కొనుగోలు చేసేస్తే రూ. వెయ్యి గిఫ్ట్​ వోచర్​, రూ. 10 వేలు  ఆపై  విలువ చేసే  సిల్వర్​ జ్యువెలరీ కొనుగోలు చేస్తే  రూ.500  గిఫ్ట్​ వోచర్​ అందిస్తోందని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా స్టోర్​ మేనేజర్​ లిగేష్​ తెలిపారు. కార్యక్రమంలో కష్టమర్లు లక్ష్మీదేవి, సులోచన,  జోయాలుక్కాస్​ సంస్థ సిబ్బంది హరీష్​, తరుణ్​ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *