PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించిన రబ్బానీ బ్రదర్స్

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం తెల్లవారుజామున  అస్తమయం అయ్యారు. నందికొట్కూరు పట్టణంలోని రబ్బాని కాంప్లెక్స్ వారి కార్యాలయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శనివారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని,కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మరియు టిడిపి నేతలు  రామోజీరావు చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రబ్బానీ బ్రదర్స్ మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావ వంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటని సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని ఈనాడు గ్రూపు  సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారన్నారు.మీడియా రంగంలో ఆయనది  ప్రత్యేకమైన శకం.ఎన్నో సవాళ్లను,సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శ నీయుడని దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారని అన్నారు. రామోజీ రావు అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డా.కాటేపోగు రాజు,మాజీ ఎస్ఐ జాన్,ధర్మ,మారుతి నగర్ టీడీపీ నాయకులు అయ్యన్న, శ్రీనివాసులు,పసుల శ్రీనివాసులు నాయుడు,కలాకర్ పాల్గొన్నారు.

About Author