PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు  కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన చంద్రమోహన్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం ఇంచార్జ్ పుత్తా నరసింహారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కడప తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండలం లోని రామనపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రామన చంద్రమోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు పర్వత రెడ్డి వెంకటసుబ్బారెడ్డి లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పుత్తా నరసింహారెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా వారు పుత్త నర్సింహారెడ్డికి శాలువా కప్పి పూలమాలవేసి కేక్ కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టారు, అనంతరం వారు మాట్లాడుతూ, కమలాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి రాష్ట్ర కార్యదర్శి పుత్తా నరసింహారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం దిశగా ఆయన నియోజకవర్గంలోని అన్ని మండలాలకు నిధుల వరద కారిస్తున్నారని, ఇప్పటికే అన్ని మండలాలకు కోట్లాది రూపాయలు నిధులు చేకూర్చి అభివృద్ధి పనులు చేపట్టే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. రాబోవు ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి దిశగానే కాకుండా, కార్యకర్తలకు అందరికీ కూడా ఆయన భరోసా కల్పించి వారికి అన్ని విధాల అండగా ఉండడమే కాకుండా ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యకర్తలకు అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, పుత్త నర్సింహారెడ్డి మాత్రమేనని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *